సినిమా బాగుంటే జనం ఇరగబడి చూస్తారని, ఇటీవల విడుదలైన `పుష్ప` సినిమాని అలానే చూశారని, మహేష్ నటించిన `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` చిత్రాలను చూశారని, ఇటీవల చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త కుర్రాడి `ఉప్పెన` సినిమాని, అలాగే ముగ్గురు చిన్న కుర్రాళ్లు సరదాగా నటించిన (జాతిరత్నాలు) సినిమాని కూడా ఇరగబడి చూశారని తెలిపారు. నాగార్జున ఇద్దరు కుమారుల సినిమాలను కూడా గట్టిగా చూశారని చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ సినిమాని చూస్తారని తెలిపారు. అది `గబ్బర్ సింగ్ 2` అయితే సాయంత్రానికి ఎవరూ రారని, `అత్తారింటికి దారేది` లా ఉంటే జనం బాగా చూస్తారని పవన్కి చురకలంటించారు మంత్రి పేర్నినాని.