రిషి (Rishi), వసులు (Vasu) కలిసి కారులో కార్తీకమాసం వన భోజనానికి చేరుకుంటారు. ఇక కారులో నుండి దిగడమే ఆలస్యం వసు కొటేషన్స్ చెప్పడం మొదలుపెడుతుంది. పల్లెటూరి అందాల గురించి, అద్భుతాల గురించి వివరిస్తుంది.
రిషి (Rishi) అయిపోయిందా అన్నట్లు వెటకారంగా మాట్లాడుతాడు. ఇక వసు రిషి మాటలను అర్థం చేసుకొని సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక అక్కడినుంచి లోపలికి బయలుదేరుతుండగా మళ్లీ వసు (Vasu) రిషిని ఆపి షూ విప్పమంటుంది.
రిషి (Rishi) ఎందుకనేసరికి ఈ మట్టి నేలపై నడిస్తే బాగుంటుందని కాసేపు ఆ మట్టి నేల గురించి చెబుతుంది. వెంటనే రిషి వసు ఎక్కడ దాని గురించి మరింత వివరిస్తుందా అని భయపడి వసు (Vasu) మాటలకి ఫుల్ స్టాప్ చెప్పి మొత్తానికి కాళ్లకున్న చెప్పులను చేతిలో పట్టించి నడిపిస్తుంది.
అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఉండగా కాసేపు ఆ సన్నివేశం బాగా అనిపిస్తుంది. ఇక దగ్గరికి చేరుకున్నాక అక్కడినుంచి చెప్పులు వేసుకొని బయలుదేరుతారు. అక్కడ జగతి (Jagathi) కూరగాయలు కట్ చేస్తూ కనిపిస్తుంది. రిషి (Rishi) వసును తనతో రమ్మని అనటంతో వసు జగతి దగ్గరకి వెళ్తుంది.
జగతి (Jagathi) దగ్గర కూర్చొని మాట్లాడుతూ సహాయం చేస్తుంది. రిషి కూడా మహేంద్రవర్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడుతాడు. ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్తాడు. జగతి వాళ్ళ దగ్గరికి మహేంద్రవర్మ (Mahendra) వచ్చి కాసేపు సరదాగా మాట్లాడటంతో దేవయాని దూరం నుండి చూస్తూ కోపంతో రగిలిపోతుంది.
వెంటనే మహేంద్రవర్మ (Mahendra) దేవయాని చూస్తుందని కవర్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. వసు అక్కడికి పుష్ప ను రప్పించుకుంటుంది. రిషి ఎదురు పడటంతో ముగ్గురు కలిసి తోట చూడటానికి వెళ్తుంటారు. దేవయానికి (Devayani) వెంటనే కోపం రావటం తో ధరణిపై అరుస్తుంది.
వాళ్ల వెంట ధరణిని (Dharani) ఫాలో అయ్యి అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటుంది. ఇక అక్కడే ఉన్న జగతిని చూసి కుళ్ళుకుంటుంది. అప్పుడే ఒక ఆవిడ జగతి (Jagathi) గురించి చెప్పటం తో లోలోపల మండిపడుతుంది.
ధరణి (Dharani) అక్కడ ఒక చెట్టు ని చూసి ఉయ్యాల గురించి మాట్లాడటంతో వసు వెళ్లి ఆ చెట్టుకు ఉయ్యాల కట్టడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే జారి పడటంతో రిషి పై పడుతుంది. లేచి పడుకోలేదు ఏంటి సార్ అని అనేసరికి రిషి (Rishi) తనకు కౌంటర్ వేస్తాడు.