ఆ తర్వాత కథ మలేషియాకి మారుతుంది. చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మలేషియాలోని హీరోయిన్ శృతి హాసన్ పరిచయం అవుతుంది. ఇంటర్వెల్ వరకు ఈ చిత్రం అక్కడడక్కడ కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ సన్నివేశాలతో యావరేజ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ లోనే పూనకాలు లోడింగ్ మూమెంట్ వస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చారు. ఆయన లుక్స్, మ్యానరిజమ్స్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి.