చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా వేగం పూర్తిగా మారిపోయింది అని మురళీమోహన్ అన్నారు. అప్పటివరకు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి హీరోలంతా ఒక స్టైల్ ఫాలో అయ్యేవారు. కానీ చిరంజీవి తెలుగు సినిమాకి కొత్త స్టైల్ తీసుకొచ్చారు. పాటల్లో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా హైలెట్ అవ్వచ్చు అని చిరంజీవి నిరూపించినట్లు మురళీమోహన్ అన్నారు.