చిరంజీవి విషయంలో తప్పులో కాలేసిన కృష్ణంరాజు, అల్లు అరవింద్.. మొగుడవుతాడు చూడండి అంటూ మరో హీరో అంచనా

tirumala ANPublished : May 12, 2025 8:28 AM

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించారు. 1979లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైంది. 

15
చిరంజీవి విషయంలో తప్పులో కాలేసిన కృష్ణంరాజు, అల్లు అరవింద్.. మొగుడవుతాడు చూడండి అంటూ మరో హీరో అంచనా
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించారు. 1979లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైంది. నటనతో డాన్స్లతో నెమ్మదిగా ఎదుగుతూ ఖైదీ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విస్ఫోటనం సృష్టించారు.

25

ఖైదీ మూవీ చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి హీరోలతో సన్నిహితంగా ఉండేవారు. వీళ్లంతా కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. చిరంజీవి చురుకుదనం చూసి.. లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య అతడిని అల్లుడుగా చేసుకోవాలని భావించారు. తన కుమార్తె సురేఖని ఇచ్చి చిరంజీవికి వివాహం చేశారు.

35

అప్పటికే చిరంజీవి నటనలో నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు కానీ స్టార్ హీరో కాలేదు. అయితే చిరంజీవిని బిగినింగ్ లో చూసినప్పుడు కృష్ణంరాజు అల్లు అరవింద్ తప్పుగా అంచనా వేశారట. చిరంజీవి విషయంలో కృష్ణంరాజు అల్లు అరవింద్ అంచనా పూర్తిగా తప్పింది. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి రగ్గడ్ లుక్, యాక్టివ్  నెస్ చూసి కృష్ణంరాజు మురళీమోహన్ తో ఇలా అన్నారట. 'వీడు ఇండస్ట్రీలో మంచి విలన్ అవుతాడండి' అని కృష్ణంరాజు అన్నారట.

45

వెంటనే మురళీమోహన్ కృష్ణంరాజుకి సమాధానం ఇచ్చారట. ఇండస్ట్రీలో విలన్ అవడం ఏంటండీ బాబు.. ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి అని మురళీమోహన్ అంచనా వేశారట. కృష్ణంరాజు తరహాలోనే అల్లు అరవింద్ కూడా చిరంజీవి గురించి పొరపాటు పడ్డారు. మా చెల్లెలు సురేఖని చిరంజీవికి ఇవ్వాలనుకున్నాం. ఆ టైంలో చిరంజీవిని చూసినప్పుడు మంచి విలన్ అవుతాడు అని అనుకున్నా. కానీ ఇంత పెద్ద స్టార్ హీరో అవుతాడని ఊహించలేదు అని అల్లు అరవింద్ అన్నారట.

55

చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా వేగం పూర్తిగా మారిపోయింది అని మురళీమోహన్ అన్నారు. అప్పటివరకు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి హీరోలంతా ఒక స్టైల్ ఫాలో అయ్యేవారు. కానీ చిరంజీవి తెలుగు సినిమాకి కొత్త స్టైల్ తీసుకొచ్చారు. పాటల్లో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా హైలెట్ అవ్వచ్చు అని చిరంజీవి నిరూపించినట్లు మురళీమోహన్ అన్నారు.

 

Read more Photos on
click me!