వెంటనే దేవి వరప్రసాద్ ఈవీవీ, చిరంజీవి కాంబినేషన్ సెట్ చేశారు. ఆ విధంగా అల్లుడా మజాకా చిత్రం సెట్ అయింది. ఈ చిత్రానికి కథ అందించింది ఎవరో కాదు.. నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణమురళి. కథ చెప్పినప్పుడు చిరంజీవికి నచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బంది కరంగా ఉన్నాయి, డైలాగులు కూడా డబుల్ మీనింగ్ ఎక్కువగా ఉన్నాయి అని చిరంజీవి హెచ్చరించారట. అభిమానులు ఇలాంటి ఊర మాస్ నే మీ నుంచి కోరుకుంటారు అని ఈవీవీ కన్విన్స్ చేశారట.