ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పుపై చిరంజీవి, రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ కి..

First Published Jan 8, 2023, 2:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించబోతోంది. అయితే ప్రీ రిలీజ్ వేడుకకి అనుమతుల విషయంలో అనేక ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ చివరకి పోలీసులు ఆంధ్రా యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులు ఇచ్చారు. 

అయితే చివరి నిమిషం వరకు చోటు చేసుకున్న పరిణామాలు అందరిలో ఉత్కంఠ కలిగించాయి. వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వేదిక మార్చిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ముందుగా ఆర్కే బీచ్ లో ప్లాన్ చేశారు. కానీ వివిధ కారణాలతో అక్కడ అనుమతులు లభించలేదు. పోలీసులతో సుదీర్ఘమైన చర్చలు జరిగిపిన తర్వాత చివరకి ఏయూ గ్రౌండ్స్ లో అనుమతి లభించింది. 

ప్రస్తుతం ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఏయూ గ్రౌండ్స్ మెగా అభిమానులతో పోటెత్తనుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ బాబీ ఇతర చిత్ర యూనిట్ ప్రత్యేక విమానంలో వైజాగ్ కి బయలుదేరారు. 

విమానాశ్రయంలో రవితేజ , చిరంజీవి ని మీడియా ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు గురించి ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని అభిమానులు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు అని రవితేజ తెలిపాడు. వేదిక మార్పుపై ప్రశ్నించగా వాటి గురించి ఇప్పుడు వద్దు, ఇక చాలు అని దాటవేశారు. 

ఇక చిరంజీవి మాట్లాడుతూ.. పోలీసులు వారి కంఫర్ట్ ని బట్టి అనుమతులు ఇస్తుంటారు అని చిరునవ్వు నవ్వి వెళ్లారు. ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 

click me!