సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ తనకి లేదని బాధపడ్డ చిరు.. అందుకే రాంచరణ్ ని రంగంలోకి దించి.. 

First Published Jun 14, 2024, 10:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో దాదాపుగా అన్ని జోనర్ చిత్రాలు చేశారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే చిరంజీవికి ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం మాస్ చిత్రాలే. నటనకు ప్రాధాన్యత ఉన్న స్వయం కృషి, ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి చిత్రాల్లో చిరు నటించారు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో దాదాపుగా అన్ని జోనర్ చిత్రాలు చేశారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే చిరంజీవికి ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం మాస్ చిత్రాలే. నటనకు ప్రాధాన్యత ఉన్న స్వయం కృషి, ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి చిత్రాల్లో చిరు నటించారు. ఆ చిత్రాలలో చిరంజీవి నటనకి ప్రశంసలు దక్కాయి. 

అయితే చిరంజీవికి ఒక అసంతృప్తి ఉండిపోయిందట. ఎన్టీఆర్ పేరు చెప్పగానే పౌరాణిక చిత్రాలు గుర్తుకు వస్తాయి. సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్పగానే అల్లూరి సీతారామరాజు చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ఇమేజ్ తనకి లేదని చిరంజీవి భాదపడేవారట. 

Also Read: దారుణం..తల్లి చావుబతుకుల్లో ఉండగా హీరోయిన్ ఇంట్లో ఆస్తి పంపకాలు.. ఆమె తండ్రి ఏం చేశాడో తెలుసా

చిరంజీవి పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర చెప్పారట. దీనిని కథగా చేస్తే మంచి చిత్రం అవుతుందని అన్నారట. తాను రీ ఎంట్రీ ఇస్తున్నాను కాబట్టి ఫ్యాన్స్ కోరుకునే విధంగా కమర్షియల్ సినిమా చేస్తాను. ఆ తర్వాత ఈ కథ చూద్దాం అని చెప్పారట. 

Also Read: వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు.. అబద్దాలు చెప్పి పరువు పోయినా వెంటపడుతున్నారుగా..

ఖైదీ నెంబర్ 150 తర్వాత అనుకున్నట్లుగానే సైరా చిత్ర పనులు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ కథకి న్యాయం చేయాలంటే భారీబడ్జెట్ అవసరం. అల్లూరి సీతారామరాజు తరహాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవరికీ తెలియదు. దీనితో భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదని చిరు అన్నారు. కానీ ఇలాంటి పాత్ర చేయాలనే కోరిక బలంగా ఉండేది. 

Also Read: పసిగట్టేశాడు..ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ పై కాపీ ఆరోపణలు, ఆధారాలతో సహా చూపిస్తూ రచ్చ

దీనితో సొంత నిర్మాణంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాంచరణ్ ని రంగంలోకి దించినట్లు చిరు తెలిపారు. ఆ విధంగా స్వాతంత్ర సమరయోధుడు చిత్రంలో నటించాలనే తన కోరిక నెరవేర్చుకున్నట్లు చిరంజీవి తెలిపారు. 

ఈ చిత్రాన్ని స్వయంగా రాంచరణ్ 200 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మంచి పేరు వచ్చినప్పటికీ భారీ బడ్జెట్ కారణంగా రాంచరణ్ నిర్మాతగా నష్టపోక తప్పలేదు. 

Latest Videos

click me!