సాయం అడిగిన సీనియర్ హీరోయిన్..కుదరదని చెప్పేసిన చిరు, నెగిటివ్ గా ఎలా ప్రచారం చేసిందంటే

First Published Sep 15, 2024, 2:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. అందరితో చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. అందరితో చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది. చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్లలో రాధా, రాధికా, విజయశాంతి, సుహాసిని లాంటి సీనియర్లు ఉంటారు. 

వీళ్లంతా చిరంజీవితో స్నేహపూర్వకంగా ఉంటారట. అయితే కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని మాత్రం టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవారట. ఈ విషయాన్ని సుహాసిని తెలిపింది. సుహాసిని తన రెండవ చిత్రంలోనే చిరంజీవితో కలసి నటించింది. ఆ చిత్రం మంచు పల్లకి. ఒక చిత్ర షూటింగ్ లో నేను చిరంజీవిని చూశానని సుహాసిని తెలిపింది. అప్పటికి నేను ఇంకా హీరోయిన్ కాలేదు. 

Latest Videos


అయితే చిరంజీవి అప్పట్లో సైలెంట్ గా ఉండేవారు. నన్ను చూసి ఈ అమ్మాయికి బాగా పొగరెక్కువ అని అనుకున్నారు. మంచు పల్లకి చిత్రంలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ అమ్మాయిని ఎంపిక చేశారు ఏంట్రా బాబు అని చిరంజీవి అనుకున్నారట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చెన్నై నుంచి హైదరాబాద్ కి వస్తున్నాం. నెలరోజుల పాటు హైదరాబాద్ లో షూటింగ్ ఉంది. 

ఫ్లైట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు జీవితంలో మరచిపోలేను. మీకు ఏ హోటల్ బుక్ చేసారు అని అడిగారు. హోటల్ పేరు చెప్పాను. మీరు హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉండాలి అని అడిగారు. దాదాపు నెలరోజులు అని చెప్పాను. నాకు హైదరాబాద్ కాస్త కొత్త.. ఏదైనా సాయం కావాలంటే అడుగుతాను అని అన్నట్లుగా చిరంజీవికి చెప్పాను. 

ఆయన వెంటనే నన్ను ఎలాంటి సాయం అడగొద్దు.. నేను ఏమి చేయను అని మాట్లాడడం మానేశారు. ఆయన బిహేవియర్ కి షాక్ అయ్యాను అంటూ సుహాసిని నవ్వుతూ చెప్పారు. ఏంటి బాబోయ్ ఇలాంటి క్యారెక్టర్ ఈ వ్యక్తి అని అనుకున్నా. కానీ ఆయన నన్ను ఆటపట్టించడానికి అలా అన్నారు. 

అదే టైంలో సుమలత నన్ను కలిసింది. నీకు చిరంజీవితో ఛాన్స్ వచ్చింది అంట కదా అని అడిగింది.. అవును సో వాట్ అని అడిగాను. అదేంటే అలా అంటావు.. తెలుగులో ఆయన త్వరలో సూపర్ స్టార్ కాబోతున్నారు అని అంతా అంటున్నారు అని చెప్పింది. అవునా.. ఆయన ముఖం ఏంటి విలన్ లాగా ఉంటుంది అని వెటకారంగా అన్నాను. అంతే సుమలత వెళ్లి చిరంజీవికి చెప్పేసింది. చిరంజీవి షూటింగ్ కి రాగానే విలన్ తో యాక్ట్ చేసేది ఎవరు అంటూ వెటకారంగా మాట్లాడుతూ వచ్చారు. ఈయనకి ఎలా తెలిసిపోయింది అని అనుకున్నా. సుమలతని అడిగితే అవును నేనే చెప్పా అని చెప్పింది. చిరంజీవి గారు నాపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. నువ్వు హీరోయిన్ నేను విలన్ కదా అని ఆటపట్టిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మేము నెమ్మదిగా మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని సుహాసిని తెలిపింది. 

click me!