Ram Charan Craze: నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్.. వైరల్ అవుతున్న ఫోటో

Published : May 02, 2022, 12:46 PM IST

రిలీజ్ అయ్యి నెల పైనే అవుతున్నా  ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు స్టార్స్ కు పాన్ ఇండియా రేంజ్ లో  ఫాలోయింగ్ తోపాటు క్రేజ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్ కు సంబంధించి ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది.   

PREV
16
Ram Charan Craze: నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్.. వైరల్ అవుతున్న ఫోటో

ఆర్ఆర్ఆర్ హ‌వా కొనసాగుతూనే ఉంది. కెజియఫ్2, ఆచార్య లాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆర్ఆర్ఆర్‌ కు క్రేజ్ తగ్గలేదు.  సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా క‌లెక్ష‌న్లు ఇంకా స్ట‌డీగానే ఉన్నాయి. ఈ ఆదివారం కూడా ఆర్ఆర్ఆర్ థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఆదివారం కూడా దాదాపు కోటీ వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. టాలీవుడ్  జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌ రామ రాజుగా...  జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్ గా న‌టించారు. 
 

26

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్స్ సృష్టించింది. రాజ‌మౌళి టేకింగ్‌కు పెద్ద పెద్ద మేకర్స్ సైతం ఫిదా అయిపోయారు. ఇక చరణ్ తారక్ ల న‌ట‌న అంతకు మించి అని చెప్పవచ్చు.  కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ ఒదిగిపోగా, అల్లూరీ సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ జీవించేశాడు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా విమర్షకులు ప్రశంసలు పొందాడు. 
 

36

ఇక ఈ సినిమాలో బ్రిటీష్ పోలీస్ అధికారిగా కనిపించిన రామ్ చరణ్.. సినిమా ఓ దశకు వచ్చిన తరువాత అల్లూరి సీతారామ రాజు గెటప్ లో కనిపించి అలరించాడు. ఈ పాత్రలో రామ్ చరణ్ ను చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఇక చరణ్ పాత్రకు బాలీవుడ్ తో పాటు నేపాల్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అక్కడ కూడా ట్రిపుల్ ఆర్ అదరిపోయే రెస్పాన్స్ సాధించింది. 

46

అల్లూరీ సీతారామ‌రాజు ఇలానే ఉంటాడా అనేంత‌లా చ‌ర‌ణ్ ఆ గెట‌ప్‌లో అద‌ర‌గొట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్ర‌ముఖ‌ నేపాల్ పేప‌ర్ ఫ్రంట్ పేజ్‌లో చ‌ర‌ణ్‌కు చెందిన పోస్ట‌ర్‌ను వేయ‌డం ఆస‌క్తిగా మారింది. మ్యాట‌రేంటో తెలియ‌దు కానీ చ‌ర‌ణ్ పోస్ట‌ర్ వేయ‌డంతో మెగా అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా అది రామ్ చరణ్ అంటే అని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 
 

56

ఇక ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్‌గా మారింది.  ఇంత క్రేజ్ ఉండబట్టే  ఆర్ఆర్ఆర్ సినిమా 1000కోట్ల మార్కును దాటి ఇంకా పరుగులు తీస్తుంది. ఇండియాలోనే వెయ్యి కోట్ల మార్క్ దాటిన నాలుగు సినిమాలలో మూడో చిత్రంగా నిలిచింది. ఆలీయాభ‌ట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లు గా న‌టించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.
 

66

ఈ సినిమాను త్వరలో చైనా, జపాన్ తో పాటు మరో 30 దేశాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలే రాజమౌళి సినిమా అంటే జపాన్ లో క్రేజ్ ఎక్కువగా.. ఇక ఇప్పుడు ఈసినిమాను అక్కడ ఏ రేంజ్ లో  ఆధరిస్తారో చూడాలి. 
 

click me!

Recommended Stories