థాయిలాండ్ దీవుల్లో గుంటూరు కారం హీరోయిన్.. బోట్ పై విహరిస్తూ క్రేజీ ఫోజులు

First Published Mar 21, 2024, 8:54 PM IST

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. 

అయితే చివరగా మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో మీనాక్షి చౌదరి పోషించిన పాత్ర ఆమె కెరీర్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. సినిమా కూడా నిరాశపరిచింది. 

ప్రస్తుతం మీనాక్షి చౌదరి థాయిలాండ్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. థాయిలాండ్ దీవుల్లో మీనాక్షి బికినీలో మెరిసింది. బోట్ లో విహరిస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంది. 

నెటిజన్లు మీనాక్షి అందాలకు ఫిదా అవుతున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు సమ్మర్ వెకేషన్ కి థాయిలాండ్ వెళుతుంటారు. మీనాక్షి కాస్త ముందుగానే సమ్మర్ వెకేషన్ మొదలు పెట్టింది. 

click me!