వరుణ్ తేజ్ హీరోయిన్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్.. వైరల్ ఫొటోస్

First Published Mar 28, 2024, 4:50 PM IST

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.  ఆల్రెడీ మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. 

నెమ్మదిగా ఆమెకి సౌత్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మానుషీ చిల్లర్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  ఈ మూవీ కోసం వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఇండియా మొత్తం తిరిగి ప్రమోషన్స్ చేశారు. అదంతా వృధా అయినట్లు అయింది. 

  ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్ మీడియా ముందు కనిపిస్తే సినిమాకంటే బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం గురించి మానుషీ క్రేజీ కామెంట్స్ చేసింది. 

అందం పెంచుకోవడం అనేది ఇప్పుడు వచ్చిన పద్ధతి కాదు. మన పురాణాల్లో సైతం సౌందర్యం గురించి ఎన్నో రచనలు రాశారు. అందం పెంచుకోవడం అనేది తప్పు కాదని మానుషీ తెలిపింది.  

తాజాగా మానుషీ చిల్లర్ బ్లాక్ గౌన్ ధరించి క్రేజీ గా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. తనకి పొట్టి బ్లాక్ డ్రెస్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుందని మానుషీ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో బడేమియా చోటే మియా అనే చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ఇది. 

click me!