సంతానం ప్రస్తుతం హీరోగా నటిస్తున్నప్పటికీ, అతని కామెడీనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని `మధగజరాజా `సినిమా మరోసారి రుజువు చేసింది. అలాగే, మణివణ్ణన్, మనోబాలా, సిటీ బాబు వంటి మరణించిన నటులను తెరపై చూసినందుకు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనోబాలా, మణివణ్ణన్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మనోబాలా మరణం తర్వాత, ఆయన చివరి సినిమాగా `మధగజరాజా` విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలో మనోబాలా దాదాపు 15 నిమిషాల నిడివి గల సన్నివేశంలో నవ్వులు పూయిస్తున్నారు. ఈ సినిమా విడుదలైతే నేను వేరే లెవెల్ కి వెళ్లిపోతానని సుందర్ సి దగ్గర చెబుతూ ఉండేవారట మనోబాలా.