మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. యాత్ర చిత్రంతో వచ్చిన క్రేజ్ తో ఆయన చిత్రాలని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
undefined
మమ్ముట్టి, హీరో జై, మహిమ నంబియార్ నటించిన మధురరాజా చిత్రం మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వరకు రాబట్టింది. దీనితో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
undefined
చెన్న కేశవ బ్యానర్ లో సాధు శేఖర్ మధురరాజా చిత్రాన్ని 'రాజా నరసింహా'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు నిర్మాత తెలిపారు.
undefined
ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే యాక్షన్ ఫిలిం. మంచి సందేశం కూడా ఉంటుంది. ఇక ఈ చిత్రానికి సన్నీలియోన్ ఐటెం సాంగ్ ఓ ఆకర్షణ. ఈ ప్రత్యేక గీతానికి మలయాళంలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
undefined
గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ గా నటించారు.
undefined
డబ్బింగ్ పూర్తయిన తర్వాత చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు.
undefined
యాత్ర చిత్రంలోవైఎస్ఆర్ పాత్రలో పంచె కట్టులో అలరించిన మమ్ముట్టి ఈ చిత్రంలో కూడా అదే తరహా లుక్ లో అదరగొడుతున్నారు.
undefined