మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నెమ్మదిగా సౌత్లో పాగా వేస్తుంది. ఒక్కో సినిమాతో సౌత్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. వారికి దగ్గరవుతుంది. మరోవైపు తన గ్లామర్ ఫోటో షూట్లతోనూ కుర్రాళ్లని ఆకర్షిస్తుంది.
ఐశ్వర్య లక్ష్మి ఇటీవల ట్రెండీ వేర్లో మెరుస్తుంది. అందాలను పొదుపుగా బయటపెట్టే ఈ బ్యూటీ ఈ మధ్య మాత్రం డోస్పెంచుతూ షాకిస్తుంది. ట్రెండ్ని ఫాలో అవుతూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.
తాజాగా ఈ సెక్సీ భామ.. ఎర్రచీరలో మెరిసింది. స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించి కిర్రాక్ పోజులిచ్చింది. ట్రెడిషనల్ లుక్లో కుర్రాళ్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. చీరలో కట్టిపడేస్తుంది. అదే సమయంలో రెడ్ శారీలో ఐశ్వర్య అందం రెట్టింపు కావడం విశేషం.
మలయాళంలో హీరోయిన్గా దుమ్ములేపింది ఐశ్వర్య లక్ష్మి. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. గ్లామర్ కంటే నటనకు స్కోప్ ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది.
ఈ క్రమంలో ఆ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సత్యదేవ్తో `గాడ్సే` చిత్రంలో నటించింది. ఇందులో యాక్షన్ రోల్ చేసింది. అయితే ఈ సినిమా వచ్చినట్టుగా కూడా చాలా మందికి తెలియదు. దీంతో అలా వచ్చి ఇలా కనుమరుగయ్యింది.
కానీ ఈ బ్యూటీకి డబ్బింగ్ మూవీ `మట్టికుస్తీ` మాత్రం మంచి పేరుతెచ్చింది. ఈ సినిమా కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఈ అమ్మడికి మంచి పేరొచ్చింది.
ఇటీవల `పొన్నియిన్ సెల్వన్` చిత్రాలతోనూ ఆకట్టుకుంది. రెండు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ మెప్పించింది.పుంగ్జాలి పాత్రలో మెరిసింది. గిరిజన పిల్ల తరహా పాత్రలో మెరిసింది. ఆద్యంతం మెప్పించింది. దీంతోపాటు `అమ్ము` అనే సినిమాలోనూ మెరిసింది.
అయితే `కింగ్ ఆఫ్ కోతా` సినిమాలో ఆమె మరో బలమైన పాత్ర దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. స్ట్రాంగ్ రోల్లో మెప్పించింది. ఆ తర్వాత గ్లామర్ ఫోటో షూట్లతో నెట్టింట మంటలు పెడుతుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.