శ్రీదేవి నాకు మరో అమ్మ.. పిన్ని అతిలోక సుందరిని తలచుకుని `గులాబి` హీరోయిన్‌ మహేశ్వరీ ఎమోషనల్‌

First Published Sep 1, 2021, 5:10 PM IST

ఒకప్పటి హీరోయిన్‌ మహేశ్వరి ఎమోషనల్‌ అయ్యింది. అతిలోకి సుందరి శ్రీదేవిని తలచుకుని సుమ ముందు భావోద్వేగానికి గురయ్యింది. తనకు అమ్మ తర్వాత అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అందరిని భావోద్వేగానికి గురి చేసింది.

మహేశ్వరి 1990-20లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కృష్ణవంశీ `గులాబి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది. `పెళ్లి`, `సూర్యవంశం`, `నీ కోసం`, `మా అన్నయ్య` చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది. 
 

హీరోయిన్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నసమయంలోనే ఆమె సినిమాలకు బ్రేకిచ్చింది. 2000లో వచ్చిన `తిరుమల తిరుపతి వెంకటేశా` చిత్రం ఆమెకి చివరి సినిమా. ఆ తర్వాత టెలివిజన్‌పై ఫోకస్‌ పెట్టింది. కొన్ని టీవీ షోస్‌లో చేసిన మహేశ్వరీ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
 

చాలా రోజుల తర్వాత మహేశ్వరి టీవీ షోలో మెరిసింది. సుమ యాంకర్‌గా చేస్తున్న సక్సెస్‌ఫుల్‌ షో `క్యాష్‌`లో పాల్గొంది మహేష్‌. ఇందులో అలనాటి నటీమణులు రాశి, సదా, మహేష్‌, శ్రద్ధా దాస్‌లతో కలిసి సందడి చేసింది. 
 

సుమ చేసే అల్లరికి బలవుతూనే, తనదైన స్టయిల్‌లో కామెడీ చేసి అలరించింది. ముఖ్యంగా బౌ బౌ అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌లు నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వారాంతం  ఎపిసోడ్‌ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో తన పిన్ని శ్రీదేవి గురించి తలచుకుని మహేశ్వరి ఎమోషనల్‌ అయ్యింది. 

శ్రీదేవి తనకు రెండో అమ్మ అని చెప్పింది మహేశ్వరి. సుమ అడిగిన ప్రశ్నకి ఇలా స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. షోని మొత్తం గుంబనంగా మార్చేశారు. ప్రస్తుతం ఈ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. శనివారం ఎపిసోడ్‌లోనూ హైలైట్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. 
 

శ్రీదేవి అమ్మ రాజేశ్వరి ముందు భర్త రంగారావు ద్వారా పుట్టిన కూతురు సూర్యకళ. ఆమె మహేశ్వరికి తల్లి అవుతుంది. అలా వీరిద్దరి మధ్య రిలేషన్‌ ఉండింది. మహేశ్వరికి శ్రీదేవి పిన్ని వరుస అవుతుంది.

మహేశ్వరీ సినిమాలు మానేశాక హైదరాబాద్‌లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ ఆఫీస్‌ ఓపెనింగ్‌ని శ్రీదేవినే ఓపెనింగ్‌ చేయడం విశేషం. చాలా రోజుల తర్వాత శ్రీదేవిని తలచుకుని మహేశ్వరీ ఎమోషనల్‌ అవ్వడం అందరిని ఆకట్టుకుంటుంది. 
 

click me!