రెండు - సందేశం
మహేష్ మరోసారి సందేశం పాయింట్ని ఎత్తకుని తప్పు చేశారని, అదే కొంపముంచిందంటున్నారు. మహేష్ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేశారు. `శ్రీమంతుడు`, `బ్రహ్మోత్సవం`, `భరత్ అనే నేను`, `మహర్షి` ఇలా నాలుగు సినిమాలు సందేశంతో కూడినవే. ఇప్పటికే ఫ్యాన్స్ తోపాటు సాధారణ ఆడియెన్స్ కి కూడా ఇవి బోర్ కొట్టాయి. బలమైన పాయింట్ని, అంతే ఎమోషనల్ కనెక్టివిటీతోనే చెబితే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది, లేదంటే బెడిసి కొడుతుంది. `సర్కారు వారి పాట`లో అదే జరిగింది. నిజానికి సందేశంతో పనిలేకుండా మంచి కమర్షియల్ సినిమా చేసినా బాగానే వర్కౌట్ అయ్యేది. సందేశం ఉన్న రెండో భాగమే ప్రధాన మైనస్గా నిలిచిందనే టాక్ ఇంటర్నెట్లో సర్య్కూలేట్ అవుతుంది.