వైరల్‌ ఫోటోలు: అలియా భట్‌ తండ్రి‌తో సన్నిహితంగా సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్

First Published Jun 20, 2020, 12:43 PM IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త నుంచి బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. 34 ఏళ్ల వయసులోనే యువ నటుడు ఆత్మహత్య చేసుకోవటంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
undefined
సుశాంత్ అంత్యక్రియలు పూర్తి కావటంతో అతనితో సన్నిహితంగా ఉన్నవారిని, అతని దగ్గర పనిచేసే వారిని వరుపగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్, స్నేహితురాలు రియా చక్రవర్తిని కూడా పోలీసులు ప్రశ్నించారు. గురువారం దాదాపు 10 గంటల పాటు రియాను పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
undefined
అయితే అభిమానులు కూడా సుశాంత్ మరణ వార్త నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈనేపథ్యంలో సుశాంత్ తో సంబంధం ఉన్నవారికి సంబంధించి రకరకాల విషయాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా, మహేష్ భట్‌లు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్, రియాలు హగ్‌ చేసుకొని ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
undefined
ఈ ఫోటోలు 2018లో మహేష్ భట్ పుట్టిన రోజు సందర్భంగా రియా స్వయంగా పోస్ట్ చేసింది. ఆ సమయంలో రియా మహేష్ భట్‌ సోదరులు నిర్మించిన జలేబి అనే సినిమాలో నటించింది. ఆ చనువుతోనే మహేష్‌, రియాలు అంత సన్నిహితంగా ఫోటోలు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే వారిద్దరు అంత సన్నిహితంగా ఉండటంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి.
undefined
ఇక సుశాంత్ మరణం తరువాత రియాను పోలీసులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆమె పలు కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి సుశాంత్‌, రియాలు పెళ్లి చేసుకోవాలనుకున్నట్టుగా తెలిపింది.
undefined
click me!