గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టుకోవడం అతికొద్ది మంది నటీనటులకు మాత్రమే సాధ్యం. మహానటి సావిత్రి అందులో ముందు వరుసలో ఉంటారు. ఆమె సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకునే విధానం, దర్శకుడు చెప్పినట్లు అద్భుతంగా హావ భావాలు పలికించడం ఇలా చాలా విన్నాం. మహేష్ బాబుకి ఖలేజా సెట్స్ లో ఒక మహానటుడు మైండ్ బ్లాక్ చేశాడట. మహేష్ కే మైండ్ బ్లాక్ చేసిన అతడు పెద్ద స్టార్ ఏమీ కాదు. కనీస గుర్తింపు కూడా లేదు అతడికి. మహేష్ బాబు అతడి గురించి మాట్లాడుతూ.. పూణే లో సదా శివా సన్యాసి సాంగ్ షూటింగ్ జరుగుతోంది.