అల్లు శిరీష్, నవదీప్ పరువు తీసిన మహేష్ బాబు.. అందరి ముందు సెటైర్, ఏం జరిగిందంటే

First Published Jul 8, 2024, 11:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ.. ఎవరైనా కెలికితే మాత్రం వెంటనే సెటైర్లు పడిపోతాయి. 

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ.. ఎవరైనా కెలికితే మాత్రం వెంటనే సెటైర్లు పడిపోతాయి. చాలా సందర్భాల్లో మహేష్ బాబు తనలోని ఫన్నీ యాంగిల్ చూపించారు. 

ఓ అవార్డుల కార్యక్రమంలో మహేష్ దెబ్బకి నవదీప్, అల్లు శిరీష్ పరువు పోయింది. కొన్నేళ్ల క్రితం ఐఫా అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకి నవదీప్, అల్లు శిరీష్ హోస్ట్ లుగా చేశారు. చాలా సరదాగా నవ్విస్తూ, ఫన్నీ చేష్టలు చేస్తూ వేదికపై సందడి చేశారు. వీరికి రెజీనా కూడా తోడైంది. 

Latest Videos


ఇక ఉత్తమ నటుడికి అవార్డు ఇచ్చే క్రమంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. ఉత్తమ నటుడిని ప్రకటించడానికి నాగార్జున, అమల వేదికపైకి వచ్చారు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, ఎన్టీఆర్ టెంపర్, మహేష్ బాబు శ్రీమంతుడు, ప్రభాస్ బాహుబలి, నాని  భలే భలే మగాడివోయ్ చిత్రాలతో ఉత్తమ నటుడి కేటగిరిలో నామినేట్ అయ్యారు. 

అమల విజేతని ప్రకటిస్తూ సస్పెన్స్ తో చంపేశారు. వెంటనే నాగార్జున అందుకుని మహేష్ బాబు అంటూ అనౌన్స్ చేశారు. అమల, నాగార్జున చేతుల మీదుగా మహేష్ అవార్డు అందుకున్నారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ.. శ్రీమంతుడు చిత్రం నా కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ఒకటి. ఇలాంటి చిత్రం ఇచ్చిన కొరటాల గారికి రుణపడి ఉంటాను అని అన్నారు. 

వెంటనే నవదీప్ మాట్లాడుతూ ఇన్ని అవార్డులు తీసుకుంటే లావైపోతారు సర్.. తిరిగి ఇచ్చేయండి అని అన్నాడు. వెంటనే మహేష్ రా తీసుకో అంటూ ఇచేయబోయారు. దీనితో అంతా నవ్వేశారు. 

ఆ తర్వాత మా జూనియర్స్ కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని నవదీప్, అల్లు శిరీష్ మహేష్ ని అడిగారు. నేను మెసేజ్ లు ఇవ్వను. అయినా మీ లాంటోళ్ళకి ఎవరైనా మెసేజ్ ఇస్తారా అంటూ పరువు తీశాడు. అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. 

click me!