హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా వెలిగింది ఖుష్బూ సుందర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్టార్గా రాణించింది. 1985 నుంచి 2005 వరకు హీరోయిన్గా సౌత్ని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో ఆమె `కళియుగ పాండవులు`, `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `శాంతి క్రాంతి`, `పేకాట పాపారావు` వంటి చిత్రాలు చేసింది. కీలక పాత్రలో చిరంజీవితో `స్టాలిన్` చిత్రంలోనూ మెరిసింది.
ప్రస్తుతం కీలక పాత్రల్లో, శక్తివంతమైన పాత్రల్లో మెరుస్తుంది ఖుష్బూ. చాలా సెలక్టీవ్ గా వెళ్తుంది. అదే సమయంలో `జబర్దస్త్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ మరింత దగ్గరయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఖుష్బూ తన లవ్ స్టోరీని బయటపెట్టింది. సుందరి సి ఎంత క్రేజీగా ప్రపోజ్ చేశాడో చెప్పింది.
సుందర్ సి చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఆ తర్వాత `మురై మామన్` మూవీతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే చర్చ వచ్చింది. మొదట సుందర్ సి మనసులో సౌందర్య ఉంది. ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్. సౌందర్య అంటే ఇష్టం కూడా. ఆమె చేస్తుందో లేదో అని వెనక్కి తగ్గాడట సుందర్. ఆ తర్వాత మీనాని సంప్రదించారట. కానీ డేట్స్ సెట్ కాలేదు. ఆ తర్వాత ఖుష్బూని తీసుకున్నారు. ఆ సమయంలో ఖుష్బూ.. సుందర్కి మూడో ఛాయిస్.
సినిమా షూటింగ్ బాగా జరిగింది. షూటింగ్ అయిపోయే లోపు సుందర్కి, ఖుష్బూకి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. మనసులో ఏదో స్టార్ట్ అయ్యింది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అయితే ఆ సమయంలో కెమెరామెన్ తమ మధ్య వారధిలా ఉండేవాడట. దీంతో అంతా కెమెరామెన్తో ఖుష్బూ లవ్లో ఉందని అనుకున్నారట. అతను మా మధ్య సమాచారం పాస్ చేస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలో ఓ రోజు సుందర్ వచ్చి.. మనం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు నీలా ఉంటారా? నాలా ఉంటారా అన్నాడట.
దెబ్బకి ఖుష్బూ షాక్. ఏంటి ఇలా అంటున్నాడని, దాన్నుంచి తేరుకుని, ఏంటి నాకు ప్రపోజ్ చేస్తున్నావా? అంటే అదే కావచ్చు అన్నాడట సుందర్. దీంతో మరో మాట లేకుండా, మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పిందట ఖుష్బూ. ఎందుకంటే ఆల్రెడీ సుందర్కి పడిపోయింది ఖుష్బూ. అందుకే వెంటనే ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంలో ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడట సుందర్. నేను ప్రపోజ్ చేయగానే ఎందుకు ఎస్ చెప్పావు, రెండు రోజులు ఆగి చెబుతా అని అనొచ్చు కదా, నేను ఎంతో ఫ్రీడమ్గా ఉండేవాడిని కదా అని అంటుంటాడట. అలా ఖుష్బూ, సుందర్ కలిసిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సుందర్ సి ఇప్పుడు తమిళంలో స్టార్ డైరెక్టర్గా రాణిస్తుంది. హర్రర్ సినిమాలకు ఆయన కేరాఫ్గా నిలుస్తున్నారు.
అయితే సుందర్ చేసిన `మురై మామన్` సినిమాలో హీరోయిన్గా ఆయన ఫస్ట్ ఛాయిస్ సౌందర్య. ఆమెని అప్రోచ్ అయి ఉంటే, ఆమె చేసి ఉంటే, ఖుష్బూ తన జీవితంలోకి వచ్చేది కాదు. అంతేకాదు మీనా డేట్స్ ఇచ్చినా ఇది జరిగేది కాదు. ఇదంతా ఓ డెస్టినీ ప్రకారం జరిగింది అని చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది ఖుష్బూ.
extra jabardasth promo
ఆమె ఇటీవల తెలుగులో `అజ్ఞాతవాసి`, `రామబాణం`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ షోతోపాటు టీవీ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఖుష్బూ.