మహేష్, సమంత కలిసి చేసి ఉంటే ఆ మూవీ పరిస్థితి.. సూపర్ స్టార్ క్లారిటీ అదుర్స్..

First Published Sep 19, 2022, 7:38 AM IST

చిత్ర పరిశ్రమలో అనేక పరిణామాలు జరుగుతుంటాయి. దర్శకులు ఒక హీరోని అనుకుని కథ రెడీ చేసుకోవడం.. కుదరకపోతే మరొక హీరోతో ఆ మూవీ తీయడం జరుగుతూనే ఉంది.

చిత్ర పరిశ్రమలో అనేక పరిణామాలు జరుగుతుంటాయి. దర్శకులు ఒక హీరోని అనుకుని కథ రెడీ చేసుకోవడం.. కుదరకపోతే మరొక హీరోతో ఆ మూవీ తీయడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. మహేష్ బాబు తన స్క్రిప్ట్స్ ఎంపికలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. 

సెన్సిబుల్ చిత్రాల దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా 'లైఫ్ ఆఫ్ ముత్తు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. 

నాగ ఛైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన 'ఏమాయ చేశావే' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ కథతో యువతని ఈ మూవీ మెప్పించింది. నాగ చైతన్యకి ఇదే ఫస్ట్ హిట్. ఈ కథని ముందుగా మహేష్ బాబుతో చేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. 

ఈ విషయాన్ని మహేష్ సోదరి మంజుల గారికి చెప్పాను. ఇది లవ్ స్టోరీ కదా.. మహేష్ కి నచ్చుతుందో లేదు అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకసారి కథ నేరేట్ చేయండి అన్నారు. దీనితో మహేష్ బాబుకి కథ చెప్పాను. మహేష్ వద్దు అన్నారు. మన కాంబినేషన్ లో సినిమా అంటే భారీగా యాక్షన్ మూవీ అయి ఉండాలి. అలాంటి కథ రెడీ చేయండి చేద్దాం అని అన్నారు. 

ఒక వేళ మహేష్ ఈ చిత్రం చేసి ఉంటే 'ఏ మాయ చేశావే' ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేది అని గౌతమ్ అన్నారు. దీనితో మహేష్ అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

గౌతమ్ మీనన్ అంచనా తప్పు. ఈ మూవీ మహేష్ సాధించి ఉంటే విజయం సాధించేది కాదు. మహేష్ బాబు నుంచి ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు ఆశించరు. స్లోగా సాగే కథలు మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ కావు. బ్రహ్మోత్సవం పరిస్థితి చూశాంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు క్లారిటీని అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మహేష్ అన్న ఈ మూవీ చేసి ఉంటే కనీసం డీసెంట్ మూవీ చేశాడు అనే సంతృప్తి ఉండేది. కానీ ఆ మురుగదాస్ తో స్పైడర్ అనే చెత్త సినిమా చేశాడు అని అంటున్నారు. 

click me!