అవి కూడా సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్. ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆ సినిమాలు మరేవో కాదు గోదావరి, ఫిదా. అవును కొన్ని సంవత్సరాలు క్రితం సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల గోదావరి అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కథను మొదటగా శేఖర్.. మహేష్ బాబుకు వినిపించాడట.
ఆ సమయంలో మహేష్ బాబు అంత క్లాస్ టచ్ ఉన్న సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట.దీంతో ఈ సినిమా ని రిజెక్ట్ చేశారు. అయితే గోదావరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే శేఖర్ కమ్ముల చేసిన మరో అద్భుతమైన సినిమా ఫిదా. . వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా సినిమా తెరకెక్కించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.