రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పేశారుగా

First Published Oct 9, 2024, 5:25 PM IST

ఒకవైపు మహేష్ బాబు అభిమానులు, మరోవైపు యావత్ సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. 

ఒకవైపు మహేష్ బాబు అభిమానులు, మరోవైపు యావత్ సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.  అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశారు. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 

మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో సందడి చేశారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి చిత్రం కోసం తన మేకోవర్ మార్చుకుంటున్నారు. మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. జుట్టు పొడవుగా పెంచుతున్నారు. ఇంత జరుగుతున్నా మూవీ అనౌన్స్ మెంట్ ఎందుకు ఆలస్యం అవుతోంది అనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. 

Latest Videos


మొత్తంగా మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా మీడియా నుంచి మహేష్ చిత్రానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. విజయేంద్ర ప్రసాద్ వెంటనే బదులిస్తూ ఈ చిత్ర షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అవుతుంది అని తెలిపారు. 

గుంటూరు కారం చిత్రం సంక్రాంతికి విడుదలయింది. సరిగ్గా ఏడాదికి మహేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ లోపు తప్పకుండా రాజమౌళి నుంచి అనౌన్స్ మెంట్ కానీ మీడియా సమావేశం కానీ ఉండే అవకాశం ఉంది. పూజా కార్యక్రమం ఎలాగూ ఉంటుంది. ఆ క్షణాల కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అటవీ నేపథ్యంలో వరల్డ్ మొత్తం చుట్టివచ్చే వీరుడి కథ అంటూ ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

click me!