నందమూరి నట వారసత్వం తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎంత వారసత్వంతో వచ్చినా..టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టం. అలాగే తారక్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఎంతో కష్టపడ్డాడు. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. అయితే ఈసినిమా పెద్దగా ఆడలేదు.
ఈసినిమా తరువాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మాత్రం ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. అయితే నిన్ను చూడాలని సినిమాలో తారక్ జోడీగా నటించింది హీరోయిన్ రవీనా రాజ్ పుత్. ఈహీరోయిన్ ఈసినిమా తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అసలుఆమె సినిమాలే చేసినట్టు కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది బ్యూటీ.