ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు.. ఇండస్ట్రీలో నిజమైన దేవుడు కృష్ణనే ఎందుకో తెలుసా? మురళి మోహన్ బయటపెట్టిన నిజాలు 

First Published Oct 9, 2024, 8:00 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో దేవుడు అంటే హీరో కృష్ణనే. అందుకు కారణాలు ఏమిటో, ఎంత మంచి వ్యక్తో నటుడు మురళి మోహన్ వెల్లడించారు. 
 

Ntr-Anr

ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అంటారు. వారిద్దరూ తిరుగులేని స్టార్డం అనుభవించారు. 50లలో హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ వెలుగులోకి వచ్చారు. అప్పటి నుండి దాదాపు మూడు దశాబ్దాలు చిత్ర పరిశ్రమను ఏలారు. వీరికి పోటీ ఇచ్చిన నటుడు ఎవరంటే... కృష్ణ అని చెప్పొచ్చు. 

Super Star Krishna

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్స్ గా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సమానమైన ఇమేజ్, ఫాలోయింగ్ ఒక్క కృష్ణకు మాత్రమే దక్కింది. కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. ఆయన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. 

ఫస్ట్ కౌ బాయ్ చిత్రం కృష్ణ చేశారు. తెలుగులో ఫస్ట్ సోసియో కలర్, ఫస్ట్ సినిమా స్కోప్ చిత్రాలు కృష్ణవే.ఆయన ద్విపాత్రాభినయం చేసిన సింహాసనం ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ కావడంతో ఆయనే స్వయంగా నిర్మించాడు. సింహాసనం బ్లాక్ బస్టర్ మూవీ కాగా.. కృష్ణ దర్శకత్వం వహించడం మరొక విశేషం.  

Latest Videos


Super Star Krishna

కృష్ణ నటించిన ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించేందుకు ప్రొడ్యూసర్స్ జంకేవారు. అప్పటి పరిస్థితుల రీత్యా ఇలాంటి కథలు ఆడతాయా అని సంశయించేవారు. అందుకే పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో కృష్ణ తానే వాటిని నిర్మించేవారు. తన ప్రయోగాల కారణంగా ఎదురయ్యే లాభ నష్టాలను ఆయనే భరించేవారు. కృష్ణలో ఉన్న ఓ గొప్ప గుణాన్ని నటుడు మురళీ మోహన్ ఓ సందర్భంలో బటయటపెట్టాడు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన దేవుడు అంటే కృష్ణనే అన్నారు మురళీ మోహన్. ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ... ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజమైన దేవుడు అంటే అది కృష్ణనే. ఆయన చేసిన సినిమా వలన నిర్మాత నష్టపోతే... ఆ నిర్మాతను పిలిపించేవాడు. సినిమా మొదలు పెట్టు అనేవాడు. 

నా దగ్గర కొబ్బరి కాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు అంటే. డబ్బులు ఎవరు అడిగారయ్యా.. ముందు నువ్వు సినిమా మొదలు పెట్టు అని హామీ ఇచ్చేవాడు. డైరెక్టర్ ని, సబ్జెక్టుని ఆయనే స్వయంగా ఎంపిక చేసేవాడు. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి, ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయమని చెబుతారు. ఫైనాన్సియర్స్ కి సినిమా విడుదలకు ముందే డబ్బులు ఇచ్చేయాలి. వాళ్లకు ఈయన హామీ ఇచ్చేవారు. దాని వలన నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అని అన్నారు.  

పరోక్షంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు మించిన గొప్ప గుణం కృష్ణ సొంతం. ఆయన నిర్మాతల హీరో అని మురళి మోహన్ చెప్పుకొచ్చారు. మురళి మోహన్ నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో రాణించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో కూడా మురళీ మోహన్ తన మార్క్ వేశారు. 
 

1961లో విడుదలైన కుల గోత్రాలు చిత్రంతో కృష్ణ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. సుదీర్ఘ కెరీర్లో ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఒకే ఏడాది 18 చిత్రాలు విడుదల చేసిన రికార్డు ఆయన సొంతం. పదికి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన శ్రీశ్రీ ఆయన నటించిన చివరి చిత్రం. 


బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

2022 నవంబర్ 14న కృష్ణ హార్ట్ అటాక్ కి గురయ్యారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన్ని చేర్చారు. చికిత్స పొందుతూ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మహేష్ బాబు టాప్ స్టార్ గా ఎదిగాడు. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. నెక్స్ట్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. పాన్ వరల్డ్ మూవీగా రూ. 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

click me!