అఖిల్ పోస్టర్‌పై రచ్చ‌.. సమంతను ట్రోల్‌ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్‌

First Published Jul 31, 2020, 9:41 AM IST

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. క్యారెంటైన్ లైఫ్ అనే థీమ్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అఖిల్ ల్యాప్‌టాప్‌ చూసుకుంటుండగా వెనక కూర్చున్న పూజా హెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకినట్టుగా డిజైన్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టరే సమంతను చిక్కుల్లో పడేసింది.

అక్కినేని కోడలు సమంత పెద్దగా వివాదాల జోలికి వెళ్లదు. కానీ గతంలో మహేష్ బాబు సినిమా విషయంలో సమంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాట్ టాపిక్‌ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన సినిమా వన్‌ నేనొక్కడినే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
undefined
హీరోయిన్ మహేష్ కాళ్ల దగ్గర ఉన్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్‌పై సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు సమంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ మీద కామెంట్ చేయటంతో మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined
అయితే తాజాగా అఖిల్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యింది. అఖిల్‌ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.
undefined
క్యారెంటైన్ లైఫ్ అనే థీమ్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అఖిల్ ల్యాప్‌టాప్‌ చూసుకుంటుండగా వెనక కూర్చున్న పూజా హెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకినట్టుగా డిజైన్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టరే సమంతను చిక్కుల్లో పడేసింది.
undefined
అప్పట్లో మహేష్ బాబు పోస్టర్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సమంత, అఖిల్ సినిమా పోస్టర్‌ విషయంలో మాత్రం స్పందించకపోవటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మీ మరిది సినిమా అని ఊరుకున్నావా..? అంటూ సమంతను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్‌.
undefined
click me!