మహేష్ అదృష్టం బావుంది.. పొన్నియన్ సెల్వం నుంచి తెలివిగా ఎస్కేప్ ?

First Published Oct 2, 2022, 10:47 AM IST

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ఈ చిత్రం. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు.

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ఈ చిత్రం. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ఇలా ఈ చిత్రం మొత్తం స్టార్ కాస్టింగ్ ఉంది. కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. 

మూవీలో కొన్ని అంశాలు బావున్నప్పటికీ స్లోగా సాగే కథనం డ్రాబ్యాక్ గా మారింది. అయితే ఈ చిత్రం గురించి ఆసక్తికర రూమర్ ఒకటి వైరల్ గా మారింది. మణిరత్నం మొత్తం తమిళ నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కించారు. అయితే ముందుగా ఆయన తెలుగు హీరోలు కూడా ఈ చిత్రంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. 

ఇళయ దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ ఈ చిత్రం నటించాల్సింది. ఎన్నో ఏళ్లుగా మణిరత్నం ఈ చిత్రంపై కసరత్తు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు, విజయ్ లతో పొన్నియన్ సెల్వం కోసం టెస్ట్ షూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం జయం రవి పోషించిన పాత్రకి మహేష్ బాబుని అనుకున్నారట మణిరత్నం. ఈ పాత్ర తనకి సూట్ కాదని మహేష్ పక్కకి తప్పుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోవడం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు వాయిదా పడింది. 

అనంతరం ప్రస్తుతం ఉన్న నటీనటుల్ని ఎంపిక చేసుకుని పొన్నియన్ సెల్వం చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా మహేష్ డెసిషన్ కరెక్ట్ అని అంటున్నారు. గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ కథనం ప్రేక్షకులకి కనెక్ట్ కావడం లేదు. 

ఒక వేళ మహేష్ ఈ చిత్రం చేసి ఉన్నా ఆ పాత్ర సెట్ అయ్యేది కాదు. సినిమా కూడా నిరాశపరచడంతో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చేది అని నెటిజన్లు అంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించడం తన డ్రీమ్ అని మహేష్ బాబు పలు సందర్భాల్లో తెలిపారు. 

click me!