Savitri:తెలుగువారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరోయిన్ అంటే వెంటనే సావిత్రి పేరు గుర్తుకు వస్తుంది. సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసి.. చివరకు కోమాలోకి వెళ్లింది. ఆమెను చూసి తట్టుకోలేక ఓ హీరోయిన్ బోరున విలపించిందని మీకు తెలుసా?
తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తమదైన ప్రతిభతో, నటనతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ మహానటి సావిత్రి. తెలుగు సినిమాకు దొరికిన వరం సావిత్రి. నేటితరం హీరోయిన్లకు ఆమె ఆదర్శం. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు తెలుగుతెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంత వరకూ రాలేదు. సౌందర్య, స్నేహా లాంటి హీరోయిన్లు్ సావిత్రిలా అనిపించినా.. ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు హృదయాలలో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రేక్షకులు.చివరి రోజుల్లో నరకం చూసిన సావిత్రి.. కోమాలోకి వెళ్లి.. దాదాపు 14 నెలలు అచేతనంగా ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో సావిత్రిని చూసి బోరున విలపించింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు జమున.
24
సొంత అక్కా చెల్లెళ్ల మాదిరి ఉండేవారు..
సావిత్రితో పాటు ఆతరం హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకన్న వారిలో జమున కూడా ఉన్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన, అన్యోన్యమైన ఆత్మీయ అనుబంధం ఉండేది. ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లకంటే ఎక్కువ క్లోజ్ గా ఉండేవారు. సావిత్రి జీవితంలో చెలరేగిన తుపానులను జమున ఆపలేకపోయింది. ఎన్ని సార్లు చెప్పినా.. పట్టుదలతో సావిత్రి తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితంపై వ్యతిరేక ప్రభావం పడేలా చేశాయి. ఇక సావిత్రి గురించి జమున గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ బిషయాలు వెల్లడించారు. ' సావిత్రితో తనకున్న మైత్రిని, ఆమె చివరి రోజుల్లో ఎదురైన తీవ్ర విషాద సంఘటనను పంచుకున్నారు.
34
సావిత్రి చెప్పిన మాట వినకపోవడం వల్లేనా..
సావిత్రిగారి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, జెమిని గణేషన్ ని వివాహం చేసుకోవడం, ఆ తరువాత ఆమె మద్యం అలవాటుకు బానిస కావడం వంటి విషయాలపై హోస్ట్ ప్రశ్నించగా జమున స్పందిస్తూ, "సావిత్రి నాతో ఆ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ క్షుణ్ణంగా మాట్లాడలేదు. కానీ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమానురాగాలు చాలా గొప్పవి. జెమినీని పెళ్లి చేసకోవద్దని ఎన్ని సార్లు చెప్పినా.. సావిత్రి వినలేదు. అంతా అయిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. ఓ సారి నను పట్టుకుని ఏడ్చింది. అయ్యిందేదో అయిపోయింది. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చూసుకుటూ హ్యాపీగా ఉండటానికిప్రయత్నించమని నేను అప్పుడే చెప్పాను'' అని జమున అన్నారు.
ఇక సావిత్రి తీవ్రమైన అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన సమయంలో జరిగిన ఒక ఆవేదనకరమైన సంఘటనను జమున గుర్తుచేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమానికి అప్పటి సాంస్కృతిక వ్యవహారాల మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారితో కలిసి వెళ్లినప్పుడు, సావిత్రి కోమాలో ఉందన్న విషయం తెలిసింది. దాంతో వెంటనేవెళ్లి ఆమెను చూశాను.
అచేతనంగా, కోమాలో ఉన్న సావిత్రిని చూసినప్పుడు చాలా బాధేసింది.. ఏడుపు ఆపుకోలేకపోయాను.. ఆమెను అలా చూసి తట్టుకోలేక ఏడ్చేశానని జమున ఎంతో భావోద్వేగంతో వెల్లడించారు సినీ ప్రయాణంలో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా, చివరివరకు వారి ఆత్మీయ బంధం నిలిచిపోయిదనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. సావిత్రి పట్ల జమునకి ఉన్న ప్రేమాభిమానాలు, సాటి నటిగా ఆమె పడిన వేదన తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోదు.