వివరాల్లోకి వెళ్తే, వ్యాపారి దీపక్ కోఠారి ఫిర్యాదు మేరకు 2015 నుంచి 2023 మధ్యకాలంలో శిల్పా-రాజ్ దంపతులు ఆయనను మోసం చేశారని ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న వారి కంపెనీ వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడిగా చూపుతూ మొత్తం రూ.60 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ చేశారు.