సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ డైరెక్టర్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు?

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్, వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.  రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కారణం ఏంటి? 
 

Lokesh Kanagaraj takes short break from social media  in telugu jms

2017 లో విడుదలైన 'మానగరం' సినిమాతో డైరెక్టర్ గా అడుగు పెట్టాడు  లోకేష్ కనకరాజ్. ఈసినిమా ద్వారా  ప్రేమకథను చాలా చక్కగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న లోకేష్ కనకరాజ్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ లేకుండా నటుడు కార్తితో 'ఖైదీ' సినిమాను యాక్షన్ కథాంశంతో తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

Lokesh Kanagaraj takes short break from social media  in telugu jms
లోకేష్ కనకరాజ్ సినిమాలు

ఖైదీ సినిమా లోకేష్ కనకరాజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్, లియో వంటి సినిమాలు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు వసూళ్ల పరంగా, విమర్శకుల ప్రశంసలు పొందాయి.


లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కూలీ సినిమా విడుదల

'లియో' సినిమాను పూర్తి చేసిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ సినిమాను కన్ఫార్మ్ చేశారు.  దాని ప్రకారం, ప్రస్తుతం కూలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ ను పరుగులు పెట్టించారు టీమ్. ఇక ఈ ప్రమోషన్స్ లో  పాల్గొననున్నందున, తాత్కాలికంగా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు లోకేష్ కనకరాజ్ షాక్ ఇచ్చారు.

లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియాలో బ్రేక్

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవా అనే పాత్రలో నటిస్తున్నారు. బంగారు అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి పలువురు స్టార్స్ కూడా నటిస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!