వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి నేడు ఇటలీలో జరుగుతున్న వివాహ వేడుకతో ఒక్కటి కాబోతున్నారు. మిస్టర్ చిత్రంతో మొదలైన వీరి ప్రేమాయణం ఎక్కడ మొదలైందో అక్కడే అన్నట్లుగా సుఖాంతం కాబోతోంది. మిస్టర్ షూటింగ్ లో భాగంగా వరుణ్, లావణ్య తొలిసారి ఇటలీలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది.