నేను పుట్టింది కూడా అయోధ్యలోనే.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఎమోషనల్ కామెంట్స్

First Published Jan 22, 2024, 4:08 PM IST

తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలాంతా శ్రీరాముడిపై భక్తిని చాటుకుంటూ పోస్ట్ లు చేస్తున్నారు. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

గత కొన్నేళ్లుగా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తున్న వరుణ్, లావణ్య తాము మొట్ట మొదటి సారి కలసిన చోటే పెళ్లి చేసుకున్నారు. వరుణ్, లావణ్య మిస్టర్ మూవీ షూటింగ్ కోసం తొలిసారి ఇటలీలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయమే ఇన్నేళ్ళలో ప్రేమగా మారింది. 

Latest Videos


వరుణ్, లావణ్య వివాహం, రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. నవ వధూవరులని ఆశీర్వదించారు. 

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. ప్రజలంతా ఆ చారిత్రాత్మక క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చేతుల మీదుగాప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 

సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రముఖులందరికి అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలాంతా శ్రీరాముడిపై భక్తిని చాటుకుంటూ పోస్ట్ లు చేస్తున్నారు. 

లావణ్యత్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరం గురించి ఎమోషల్ పోస్ట్ చేసింది. తాను కూడా జన్మించింది అయోధ్యలోని అని కామెంట్స్ చేసింది.  లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. స్కూల్ విద్యాబ్యాసం డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన జరగడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. 

click me!