ఇంతలో అనసూయ అక్కడికి నువ్వు ఒక్కదానివే కాఫీ కుడితి తాగినట్టు తాగడం కాదే మీ మామయ్యకు కూడా తీసుకుని వెళ్ళు అని అంటుంది. అప్పుడు అనసూయ అసలు విషయం చెప్పడంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య కావాలనే తులసి విషయం గురించి ప్రస్తావన తీసుకొస్తూ అనసూయని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంతలోనే లాస్య నందు కి ఫోన్ చేస్తూ ఉండగా నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు నందు నాన్న పరిస్థితి చూడలేక ఒక విధంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అనుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు ప్రేమ్,సామ్రాట్,తులసి ముగ్గురు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.