మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.
ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఆమె స్వతహాగా మోడల్ కాబట్టి నాజూగ్గా అందాలు ఎలా మైంటైన్ చేయాలో బాగా తెలుసు.
తాజాగా కృతి సనన్ షేర్ చేసిన ఫోటో షూట్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. థైస్ స్ల్పిట్ బాడీ కాన్ డ్రెస్ లో కృతి మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ఆమె స్కిన్ గ్లో చూస్తుంటే కుర్రాళ్లు ఆగడం కష్టం. అంత హాట్ గా కృతి సనన్ మెరుపులు మెరిపిస్తోంది.
బాలీవుడ్ సెలెబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్ డే సందర్భంగా కృతి సనన్ ఈ డ్రెస్ లో మెరిసింది. మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి కృతి సనన్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.
ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం అనే చెప్పాలి. సంక్రాంతి రిలీజ్ కావలసిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. కృతి సనన్ కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన టీజర్ పై అనేక విమర్శలు వినిపించాయి.