32 ఏళ్ళ వయస్సులో స్కూల్ కెళ్ళిన ప్రభాస్ హీరోయిన్ ,స్పెషల్ ఏంటో చెప్పిన కృతీసనన్

First Published Nov 24, 2022, 5:57 PM IST

ఒక్కసారి స్కూలింగ్ అయిపోతే.. మళ్ళీ ఎప్పుడో.. ఏదో ఒక అవసరం ఉంటేనే  స్కూల్ వైపు చూస్తుంటాం.. అప్పుడు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటా..? అలాసెలబ్రిటీలు కూడా తాము చవివిన  స్కూల్ కు చాలా కాలం తరువాత వెళ్తే.. ఆట్రీట్మెంట్ వేరే ఉంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ కూడా చిన్నప్పుడు చదువకున్న స్కూల్ కు వెళ్లింది ఎందుకో తెలుసా.? 
 


కృతీ సనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటిస్తోంది.  అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్న కృతీ శెట్టి రీసెంట్ గా తను చదివిన స్కూల్ కు వెళ్లిందట. 

దాదాపు 15 సంవత్సరాల తరువాత తాను చదివిన స్కూల్ కు వెళ్ళిందట కృతీ సనన్.  32 రెండేల్ల వయస్సులో తాను ఎందుకు స్కూల్ కు వెళ్లిందన్న డౌట్ వ్యాక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.  తన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు స్కూల్‌కు వెళ్లింది కృతిసనన్‌.
 

ప్రస్తుతం వరుణ్‌ధవన్‌ హీరోగా నటిస్తోన్న భేడియా సినిమాలో హీరోయిన్ గా  నటిస్తోంది కృతిసనన్. ఈ సినిమాను తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.. గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈమూవి తెలుగు వర్షన్ ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీని దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు టీమ్. 
 

ఈ నేపథ్యంలో బేడియా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతీ.. ప్రమోషన్స్ లో భాగంగానే  తన స్కూల్‌కు వెళ్లినట్టు తెలిపింది. అంతే కాదు తాను చదివిన స్కూల్ కు వెళ్లడం గొప్ప అనుభూతినిచ్చిందంటోంది కృతిసనన్‌. సొషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బ్యూటీ ఈ విధంగా రాసుకొచ్చింది. 
 

15 ఏండ్ల తర్వాత..తిరిగి స్కూల్‌కు వచ్చా. నేను నటించిన భేడియా సినిమాను  ప్రమోట్‌ చేయడం కోసం నా స్కూల్‌కు తిరిగి రావడం చాలా గర్వకారణంగా ఉంది. డి.పి.ఎస్. ఆర్.కె.పురం నాకు చాలా ఇచ్చింది. నిజంగా నన్నొక ఉత్తమ వ్యక్తిలా తీర్చిదిద్దింది. నా స్కూల్‌కు తిరిగి రావడం గొప్ప అనుభూతినిస్తోందని ట్వీట్ చేసింది.
 

అంతే కాదు కృతిసనన్ స్కూల్‌ గేట్‌ ముందు హ్యాపీ మూడ్‌లో  దిగిన ఫోటో ను షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్‌ నేనొక్కడినే సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ కృతిసనన్ ‌. నాగచైతన్యతో దోచెయ్‌ సినిమా చేసిన కృతీ.. ఆతరువాత తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. 

click me!