ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన బేబమ్మ.. నెల్లూరులో సందడి చేయబోతున్న కృతి శెట్టి.!

First Published Dec 1, 2022, 12:40 PM IST

యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) అభిమానులకు క్రేజీ అప్డేట్ అందించింది. ఓ ఈవెంట్ కోసం నెల్లూరుకు వెళ్తున్న ఈ బేబమ్మ ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా కలవబోతున్నట్టు తెలిపింది.
 

హ్యాట్రిక్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ జోరుకు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. 
 

ప్రస్తుతం కృతి శెట్టి శెట్టి బిజీ షెడ్యూల్ నుంచి కాస్తా ఫ్రీ అయ్యింది. దీంతో అభిమానులకు టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

మతిపోయేలా చీరకట్టి గ్లామర్ విందు చేస్తున్న ఈ బ్యూటీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల అందాల విందులో మరింతగా రెచ్చిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ను అందింది.
 

డిసెంబర్ 2న (రేపు) ఏపీలోని నెల్లూరులో ఈ బ్యూటీ సందడి చేయబోతోంది. నెల్లూరోని అన్నమయ్య సర్కిల్ దగ్గల్లో హోటల్ తేజస్వి గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కృతి శెట్టి ముఖ్య అతిథిగా హాజరు కాబోతోంది. ఈ విషయాన్ని బేబమ్మనే తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది.

డిసెంబర్ 2న (రేపు) ఏపీలోని నెల్లూరులో ఈ బ్యూటీ సందడి చేయబోతోంది. నెల్లూరోని అన్నమయ్య సర్కిల్ దగ్గల్లో హోటల్ తేజస్వి గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కృతి శెట్టి ముఖ్య అతిథిగా హాజరు కాబోతోంది. ఈ విషయాన్ని బేబమ్మనే తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది.

‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి వరుసగా ఆరు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. కానీ చివరిగా మూడు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సూరియా 44లో హీరోయిన్ గా నటిస్తోంది.

click me!