ఇక షోలో ప్రభాస్, గోపీచంద్ లతో బాలయ్య ఓ ఆటాడేసుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ బుల్లితెరపై అడుగుపెట్టడంతో ఆసక్తికరమైన విషయాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టు చేశారు. ముందుగా ప్రభాస్ ను ఆహ్వానించి, ఆ తర్వాత గోపీచంద్ కు వెల్ కమ్ చెప్పారు. తనదైన శైలిలో వారిద్దరిపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. డిసెంబర్ 30న ఆహాలో ప్రసారం కానుంది.