ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే అనాధాశ్రమంలో ఆడుకుంటున్న మురారిని చూసి ఇంత మంచి మనిషిని నేను వదులుకోవాల్సి వస్తుంది. ఈయన మనసులో ఇంకొకరు లేకపోయినా బాగుండేది. ఈ జన్మకి నా రాత ఇంతే అని బాధపడుతుంది కృష్ణ. తర్వాత వాళ్లు కొంచెం సేపు అక్కడ కళ్ళ గంతులు ఆడుకుంటారు అప్పుడు కృష్ణని చూస్తూ, ఈ అగ్రిమెంట్ ఏవి లేకుండా కృష్ణ జీవితాంతం నాతోనే ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాడు. తర్వాత అందరూ వెళ్లి జ్యూస్ తాగుతారు. ఇంతలో మురారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామిడి పళ్ళు ఇస్తాడు.