Varanasi: రాజమౌళి, మహేష్‌ బాబు `వారణాసి`లో మరో స్టార్‌ హీరో.. విక్రమ్‌ నో చెప్పిన పాత్రలో కనిపించేది ఎవరంటే?

Published : Feb 19, 2026, 05:21 PM IST

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమాలో విక్రమ్ వద్దనుకున్న ఒక కీలక పాత్ర కోసం మరో మాస్ హీరోని ఫైనల్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

PREV
14
వారణాసిలో మరో స్టార్‌ హీరో?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `వారణాసి` చిత్రంలో సుదీప్ నటించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పాత్రను మొదట చియాన్ విక్రమ్‌కు ఆఫర్ చేయగా, ఆయన తిరస్కరించడంతో ఇప్పుడు మరో స్టార్‌ హీరో నటించబోతున్నారట. ఆ పాత్ర కోసం మరో బిగ్‌ స్టార్‌ని దించబోతున్నారట. 

24
`వారణాసి`లో కిచ్చ సుదీప్‌

గతంలో రాజమౌళి తీసిన 'ఈగ' సినిమాలో సుదీప్ విలనిజం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాతోనే సుదీప్‌కు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'బాహుబలి'లో కూడా సుదీప్ ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న ఈ యాక్షన్అడ్వెంచర్  `వారణాసి` చిత్రంలో సుదీప్‌కు చాలా పవర్‌ఫుల్ పాత్ర ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

34
వారణాసి కేంద్రంగా `వారణాసి` మూవీ ?

వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ వారణాసి, కాశీ నేపథ్యంలో సాగుతుందట. కథలో సుదీప్ పాత్ర ఒక పెద్ద మలుపునకు కారణమవుతుందని చెబుతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన కథను సిద్ధం చేశారు. హంపి, వారణాసి వంటి చారిత్రక ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వారణాసి షెడ్యూల్‌లో కిచ్చా సుదీప్ పాల్గొంటారని ప్రస్తుత సమాచారం.

44
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ `వారణాసి`

`వారణాసి`లో కిచ్చ సుదీప్‌ నటించబోతున్నారనే వార్తతో ఇటు సుదీప్ అభిమానులతోపాటు మహేష్‌ అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఒకవేళ సుదీప్ ఈ సినిమాలో నటిస్తే, ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. 'ఇండియానా జోన్స్' తరహాలో సాగే ఈ అడ్వెంచర్ సినిమాకు సుదీప్ గంభీరమైన వాయిస్, నటన ప్లస్ పాయింట్ అవుతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీలో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories