నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) యానివర్సరీ వేడుకలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాయల్ లుక్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
NMACC మూడో వార్షికోత్సవ వేడుకలో కియారా, సిద్ధార్థ్ జంటగా మెరిశారు. "డేట్ నైట్" అంటూ కియారా ఈ ఫొటోలను పోస్ట్ చేసి, తమ స్టైలిష్ ఈవెనింగ్ను అభిమానుల తో పంచుకుంది.
25
కియారా కట్టిన మసాబా చీర
కియారా ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా లేబుల్కు చెందిన చీరను ఎంచుకుంది. దీని ధర రూ.1.3 లక్షలు. ఈ సిల్క్ క్రేప్ చీరపై 'పాంఖ్ బాగ్', 'గుల్ ఝరోఖా' వంటి సిగ్నేచర్ మోటిఫ్లతో రాయల్ లుక్ వచ్చింది.
35
లుక్ను హైలైట్ చేసిన జ్యువెలరీ
చీరకు తగ్గట్టుగా, మసాబా కలెక్షన్లోని మహారాణి స్టైల్ నెక్లెస్ను కియారా ధరించింది. బంగారం, ముత్యాలు, వజ్రాలతో చేసిన ఈ నెక్లెస్ ధర సుమారు రూ.1.85 లక్షలు అని సమాచారం.
కియారా చేతిలో హెర్మెస్కు చెందిన మినీ కెల్లీ పోచెట్ బ్యాగ్ ఉంది. రీసేల్ మార్కెట్లలో ఈ బ్యాగ్ ధర సుమారు రూ.22 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఉంటుంది. ఇది నిజమైన కలెక్టర్స్ ఐటమ్.
55
బ్యూటీ, స్టైలింగ్ డీటెయిల్స్
కియారా తన బ్యూటీ లుక్ను చాలా సింపుల్గా ఉంచింది. పింక్ టోన్డ్, డ్యూయీ మేకప్తో మెరిసింది. లూజ్ కర్ల్స్తో ఉన్న ఆమె హెయిర్స్టైల్, డ్రెస్సుకు పర్ఫెక్ట్గా సెట్ అయింది.
అందమైన ప్రేమకథ..
2023లో సూర్యగఢ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కియారా, సిద్ధార్థ్.. తమ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. జూలై 2025లో వీరికి కూతురు పుట్టడంతో, వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.