స్వార్థపరుల చేతుల్లో సినీ కార్మికుల భూములు.. మండిపడ్డ నిర్మాత!
First Published Aug 7, 2019, 4:36 PM ISTప్రముఖ దర్శకనిర్మాత, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్ బాస్ 3 షో ప్రారంభానికి ముందు అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ని రద్దు చేయాలంటూ కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కేతిరెడ్డి మరో ఉద్యమాన్ని తన భూజాల మీద వేసుకున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికులకు కేటాయించిన భూముల అవినీతి విషయంలో కేతిరెడ్డి నిరసన చేపట్టారు.