ఇప్పుడు నేను ఏం చేశానని మా అమ్మని అలా రెచ్చగొడుతున్నావు, బాగా ఓవరాక్షన్ చేస్తున్నావ్ అత్త అని కోప్పడతాడు రాజ్. ధాన్యలక్ష్మి, ప్రకాష్ కూడా రుద్రాణిని మందలిస్తారు. అప్పుడు అపర్ణ పనిమనిషిని పెట్టాలనుకుంటే కొత్తావిడని పెట్టొచ్చుకదా తిననే ఎందుకు పెట్టుకున్నావు అంటుంది అపర్ణ. శాంతకి అన్నీ తెలుసు, మళ్లీ మనం ఏమి చెప్పక్కర్లేదు అంటాడు రాజ్. ఇంటి పనుల్లో బిజీ అయిపోయి తాతయ్య సంగతి మర్చిపోతుంది.తాతయ్యకి ఏ మందులు వేయాలో కావ్య కి మాత్రమే తెలుసు అంటాడు రాజ్.