ప్రస్తుతం నిరూపమ్ వరుసగా సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `కార్తీకదీపం 2` సీరియల్తో బిజీగా ఉన్నారు. నిరుపమ్ `చంద్రముఖి` సీరియల్తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత `బ్రహ్మముడి`, `హిట్లర్గారి పెళ్ళాం`, `కుంకుమపువ్వు`, `మూగమనసులు`, `కార్తీకదీపం`, `అత్తారింటికి దారేది`, `కలవారి కోడళ్లు`, `కాంచనగంగ`, `ప్రేమ`, `రాధకు నీవెర ప్రాణం` వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్నాడు నిరుపమ్.