లాక్‌ డౌన్‌ అలా కలిసొచ్చింది.. మళ్లీ తల్లవుతున్న కరీనా

First Published Aug 12, 2020, 4:54 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్‌ కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్ లు మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ స్టార్స్ రెండో బిడ్డను ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నటుడు సైఫ్‌ అలీ ఖాన్ కూడా ధృవీకరించాడు.

లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌. ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు జాతీయ స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్‌లు రెండు బిడ్డకు జన్మనివ్వనున్నారట. ఈ విషయంపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
undefined
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ జంటకు బాగా కలిసొచ్చిందట. ఈ సమయంలోనే ఆమె గర్భం దాల్చినట్టుగా బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సైఫ్, కరీనాాల సన్నిహితులు ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు.
undefined
ఇటీవల గుడ్‌ న్యూజ్‌ ప్రమోషన్‌ సందర్భంగా ఆమె తన రెండో బిడ్డ గురించి చెప్పింది. ప్రస్తుతానికి తమ రెండో బిడ్డకు సంబంధించి ఎలాంటి ప్లాన్ చేసుకోవటం లేదని, తైమూర్‌తోనే తమకు సమయం సరిపోతుందని చెప్పింది కరీనా.
undefined
ప్రస్తుతం కరీనా, ఆమిర్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్ధా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో 1994లో రిలీజ్ అయిన హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్స్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.
undefined
click me!