తరుణ్‌ రాజ్‌తో ఆ సంబంధం లేదు.. నేను డ్రగ్‌ తీసుకోలేదు.. అనుశ్రీ స్పష్టం

Published : Sep 27, 2020, 07:56 AM IST

కన్నడ డ్రగ్‌ కేసులో టీవీ యాంకర్‌ అనుశ్రీని శనివారం కర్నాటక పోలీసులు విచారించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆమె విచారణ ప్రారంభం కాగా, దాదాపు మూడున్నర గంటల పాటు ఆమెని విచారించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.   

PREV
15
తరుణ్‌ రాజ్‌తో ఆ సంబంధం లేదు.. నేను డ్రగ్‌ తీసుకోలేదు.. అనుశ్రీ స్పష్టం

బాలీవుడ్‌లోనే కాడు, కన్నడనాట డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంజనా గల్రానిని అరెస్ట్ చేశారు. ఇటీవల అనుశ్రీ పేరు కూడా వినిపించడంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

బాలీవుడ్‌లోనే కాడు, కన్నడనాట డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంజనా గల్రానిని అరెస్ట్ చేశారు. ఇటీవల అనుశ్రీ పేరు కూడా వినిపించడంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

25

డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కిశోర్‌ అమన్‌ శెట్టిని అనుశ్రీ కలిసిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొరియోగ్రాఫర్‌ తరుణ్‌ రాజ్‌ సైతం ఇందులో ఇన్‌వాల్వ్ అయినట్టు ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. 

డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కిశోర్‌ అమన్‌ శెట్టిని అనుశ్రీ కలిసిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొరియోగ్రాఫర్‌ తరుణ్‌ రాజ్‌ సైతం ఇందులో ఇన్‌వాల్వ్ అయినట్టు ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. 

35

కిశోర్‌ అమన్‌ శెట్టితో, తరుణ్‌ రాజ్‌తో ఉన్న సంబంధాలపై, అలాగే డ్రగ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నావనే దానిపై పోలీసులు అనుశ్రీని విచారించారు. తరుణ్‌ రాజ్‌ తనకు 12ఏళ్ళుగా తెలుసని, కాకపోతే తాను డ్రగ్స్ విషయంలో వారిని కలవలేదని, తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని అనుశ్రీ చెప్పారు. 
 

కిశోర్‌ అమన్‌ శెట్టితో, తరుణ్‌ రాజ్‌తో ఉన్న సంబంధాలపై, అలాగే డ్రగ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నావనే దానిపై పోలీసులు అనుశ్రీని విచారించారు. తరుణ్‌ రాజ్‌ తనకు 12ఏళ్ళుగా తెలుసని, కాకపోతే తాను డ్రగ్స్ విషయంలో వారిని కలవలేదని, తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని అనుశ్రీ చెప్పారు. 
 

45

విచారణ అనంతరం అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. పోలీసులు మళ్ళీ పిలిస్తే విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే మళ్ళీ ప్రశ్నించాల్సి ఉంటుందనే విషయాన్ని పోలీసులు తెలపలేదన్నారు. 
 

విచారణ అనంతరం అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. పోలీసులు మళ్ళీ పిలిస్తే విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే మళ్ళీ ప్రశ్నించాల్సి ఉంటుందనే విషయాన్ని పోలీసులు తెలపలేదన్నారు. 
 

55

`డ్రగ్‌ మాఫియా మన రాష్ట్రాన్ని వెంటాడిన దెయ్యం. ఆ మాఫియాని నిర్మూలించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తుకి మేం సహకరిస్తాము` అని ఆమె చెప్పారు. తరుణ్‌ రాజ్‌ చెప్పిన వివరాల మేరకు అనుశ్రీని కర్నాటక పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

`డ్రగ్‌ మాఫియా మన రాష్ట్రాన్ని వెంటాడిన దెయ్యం. ఆ మాఫియాని నిర్మూలించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తుకి మేం సహకరిస్తాము` అని ఆమె చెప్పారు. తరుణ్‌ రాజ్‌ చెప్పిన వివరాల మేరకు అనుశ్రీని కర్నాటక పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories