మరో పోస్ట్ లో.. అయాన్ ముఖర్జీని మేధావి అనే వారందర్నీ జైలుకు పంపించాలని, 'బ్రహ్మాస్త్ర' కోసం అతనికి 12 ఏళ్లు పట్టిందని తెలిపింది. 400 రోజులకు పైగా షూట్ చేసిన ఈ చిత్రానికి 14 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చారని, ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశారని మండిపడింది. 'బాహుబలి' సక్సెస్ తో 'బ్రహ్మాస్త్ర'ను జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా మార్చారని, మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.