'సీతారామం' పై కంగనా రనౌత్ రివ్యూ.. జిందాబాద్ అంటూ ఊహించని కామెంట్స్

First Published Sep 21, 2022, 9:42 PM IST

హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం అపురూప ప్రేమ కావ్యంగా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టారు.

హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం అపురూప ప్రేమ కావ్యంగా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో హిందీలో కూడా సత్తా చాటుతోంది. 

హిందీ సెలెబ్రిటీలపై విరుచుకు పడే ఫైర్ బ్రాండ్ లేడీ కంగనా రనౌత్ సీతారామం చిత్రంపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది. చివరిగా సీతారామం మూవీ చూసే టైం దొరికింది. ఈ చిత్రం చూశాను. అద్భుతమైన అనుభూతికి లోనయ్యా. చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ఇది. 

దర్శకత్వం, స్క్రీన్ ప్లే అదిరిపోయింది. హను రాఘవపూడి నా అభినందనలు. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు స్క్రీన్ పై కనిపించింది. నటీనటులు ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసారు. కానీ నేను మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 

ఆమె పాత్రలో ఎమోషన్స్, హుందాతనం పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరొక నటి ఆమె పాత్రని చేయలేరేమో. దర్శకుడు అందుకే ఆమెని ఎంచుకున్నాడు. మృణాల్ ఠాకూర్ నిజమైన మహారాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్.. నీ రూలింగ్ మొదలైంది అంటూ కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. 

కంగనా రనౌత్ నుంచి ఇవి ఊహించని కామెంట్స్ అనే చెప్పాలి. కంగనాకి ఏ చిత్రమూ అంత ఈజీగా నచ్చేయదు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా చిత్రాలపై కంగనా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

దర్శకుడు హను రాఘవపూడి సీతారామం చిత్రాన్ని ప్రాణం పెట్టి చేశారు. తన గత చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. బలమైన కథ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే తో సీతారామం చిత్రంలో అదరగొట్టేశారు. హను రాఘవపూడికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 

click me!