ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్, లేవలేని స్థితిలో తల్లి.. పవన్ రెడ్డి మోసం చేశాడా, బిగ్ బాస్ శ్రీసత్య కన్నీటిగాధ ?

First Published Sep 21, 2022, 7:30 PM IST

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ శ్రీ సత్య. క్యూట్ గా, అందంగా ప్రేక్షకులని మాయ చేస్తోంది. బుల్లితెర నటిగా శ్రీసత్య మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ శ్రీ సత్య. క్యూట్ గా, అందంగా ప్రేక్షకులని మాయ చేస్తోంది. బుల్లితెర నటిగా శ్రీసత్య మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి ప్రేక్షకులని మాయ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా శ్రీ సత్య చాలా యాక్టివ్. 

ఇదిలా ఉండగా శ్రీసత్య వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కన్నీటి గాధలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు శ్రీసత్య ఓ ఇంటర్వ్యూలు చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. టీనేజ్ లోనే ఆమె పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది అట. అతడితోనే నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాతే పవన్ రెడ్డి తనని మోసం చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

జరిగిన స్టోరీ మొత్తం చెప్పుకొచ్చింది. మొదటి నుంచి మా ఇద్దరి పెళ్లి మా కుటుంబాలకి ఇష్టం లేదు. ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. దీనితో ఉన్నపళంగా నిశ్చితార్థం రద్దయింది. ఆ టైంలో పవన్ కూడా వెనకడుగు వేసి మోసం చేశాడు అని శ్రీసత్య వాపోయింది. 

ఈ సంఘటన తర్వాత మా అమ్మ ఆరోగ్యం దెబ్బతినింది. ఆమె ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉందని శ్రీసత్య కన్నీరు పెట్టుకుంది. దీనిపై పవన్ తన సన్నితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

తనకి మోసం చేసే ఉద్దేశమే ఉంటే నిశ్చితార్థం వరకు ఎందుకు వెళతాను అని అన్నాడట. శ్రీ సత్య కావాలనే తనని బ్యాడ్ చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని పవన్ రెడ్డి మండిపడ్డట్లు టాక్. 

గ్లామర్ పరంగా శ్రీ సత్య ఆడియన్స్ కి నచ్చేసింది. కానీ ఆమె టాస్క్ లలో చురుగ్గా పాల్గొనదు అనే కంప్లైంట్ ఉంది. మరి ఈ లోపాన్ని సరిచేసుకుని హౌస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. శ్రీసత్య బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఆమె గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

click me!