రాంచరణ్ కంటే ముందుగా..జూ.ఎన్టీఆర్ కలసి నటించాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..పబ్లిక్ గా చెప్పేశాడు

First Published Jun 22, 2024, 4:51 PM IST

వీటన్నింటికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నారు. పబ్లిక్ గా ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పారు కూడా.

NTR

టాలీవుడ్ ఒకప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడన్ని వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు అనేక చిత్రాల్లో కలసి నటించారు. కానీ క్రమంగా టాలీవుడ్ లో మల్టి స్టారర్ చిత్రాలు తగ్గుతూ వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కించిన తర్వాత మరోసారి మల్టీస్టారర్ చిత్రాల గురించి చర్చ మొదలైంది. 

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ లో తారక్.. హృతిక్ రోషన్ తో కలసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నారు. 

పబ్లిక్ గా ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పారు కూడా. ఆ హీరో ఎవరో కాదు .. కింగ్ నాగార్జున. నాగార్జునకి తారక్ తో, అతడి తండ్రి నందమూరి హరికృష్ణతో మంచి అనుభందం ఉంది. నాగార్జునకి బాలయ్యతో విభేదాలు ఉన్నప్పటికీ.. హరికృష్ణ, ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. 

హరికృష్ణని నాగార్జున సొంత అన్నయ్యగానే భావిస్తారు. నాగార్జున, హరికృష్ణ కలసి సీతారామరాజు అనే చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. ఎన్టీఆర్ కి మనం మూవీ తరహాలో తన ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీతో కలసి ఒక సినిమా చేయాలని ఉండేదని తెలిపారు. 

తారక్ ఈ విషయాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి హాజరైనప్పుడు తెలిపారు. తాతగారు కూడా ఉండిఉంటే బావుండేది.. మనం అందరం కలసి నటించాలనేది నా కోరిక అని నాగార్జునతో తెలిపాడు. అలా చేస్తే చాలా బావుంటుందని నాగార్జున కూడా అన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, నాగచైతన్య కలసి రాముడు భీముడు రీమేక్ చేయాలనే ప్రపోజల్ కూడా వచ్చింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. 

ఇప్పుడు ఎన్టీఆర్ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్, హరికృష్ణ లేరు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో నాగార్జున, ఎన్టీఆర్ ఇద్దరికీ కుదిరి ప్రాజెక్టు పట్టాలెక్కడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. 

Latest Videos

click me!