నందమూరి వారసత్వంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. బాల రామాయణం చిత్రంతో నటనలో ఓనమాలు దిద్దిన తారక్.. యుక్త వయసు వచ్చాక నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి తారక్ జైత్ర యాత్ర మొదలైంది. నందమూరి వారసత్వం కొనసాగిస్తూ.. తాత ఎన్టీఆర్ , బాబాయ్ బాలకృష్ణ తరహాలో తెలుగు ప్రేక్షకులని అలాంటించిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు.